పాపం.. పాన్ ఇండియా అంటూ తలలు పట్టుకున్నారు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీల హవా జోరుగా నడుస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాతో మరికొన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా తమ ప్రత్యేకతను చాటుకునేందుకు రెడీగా ఉన్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ను ఇటీవల ప్రారంభించగా, ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం యావత్ టాలీవుడ్ జనం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా టాలీవుడ్ క్రేజీ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా ఇది కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.

Advertisement

అయితే ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీ మార్క్‌ను వేసుకుని ఇప్పుడు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి.ఈ సినిమాలో ఇతర భాషకు చెందిన నటీనటులు ఎక్కువగా నటిస్తుండటంతో, ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ఆయా చిత్రాలు షూటింగ్‌ను వాయిదా వేసుకున్నాయి.

ప్రస్తుతం షూటింగ్‌లకు అనుమతి లభించడంతో ఈ రెండు సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని దర్శకులు భావిస్తున్నారు.కానీ ముంబైకి చెందని యాక్టర్స్ ఎవరూ కూడా హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

దీంతో ఈ రెండు చిత్రాల యూనిట్‌లు తలలు పట్టుకున్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు