పాపం.. పాన్ ఇండియా అంటూ తలలు పట్టుకున్నారు!
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా మూవీల హవా జోరుగా నడుస్తోంది.ఇప్పటికే టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్న సంగతి తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాతో మరికొన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా తమ ప్రత్యేకతను చాటుకునేందుకు రెడీగా ఉన్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ను ఇటీవల ప్రారంభించగా, ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కోసం యావత్ టాలీవుడ్ జనం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా టాలీవుడ్ క్రేజీ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కూడా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా ఇది కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.
అయితే ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీ మార్క్ను వేసుకుని ఇప్పుడు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి.
ఈ సినిమాలో ఇతర భాషకు చెందిన నటీనటులు ఎక్కువగా నటిస్తుండటంతో, ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ఆయా చిత్రాలు షూటింగ్ను వాయిదా వేసుకున్నాయి.
ప్రస్తుతం షూటింగ్లకు అనుమతి లభించడంతో ఈ రెండు సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాలని దర్శకులు భావిస్తున్నారు.
కానీ ముంబైకి చెందని యాక్టర్స్ ఎవరూ కూడా హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
దీంతో ఈ రెండు చిత్రాల యూనిట్లు తలలు పట్టుకున్నారు.
తండ్రి హమాలీ.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొడుకులు, కూతురు.. వీళ్ల సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!