తెలుగులోని టాలెంటెడ్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరనే సంగతి తెలిసిందే.తెలుగులోని దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి పూరీ జగన్నాథ్ పని చేశారు.
పూరీ జగన్నాథ్ ఎక్కువగా యూత్ ను ఆకట్టుకునే అంశాలతో సినిమాలను తెరకెక్కిస్తారనే సంగతి తెలిసిందే.పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపులతో డీలా పడిన ప్రతిసారి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం లైగర్ సినిమాతో పూరీ జగన్నాథ్ బిజీగా ఉన్నారు.
లైగర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే పూరీ జగన్నాథ్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరో అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.జనగణమన పేరుతో ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించనుండటం గమనార్హం.
అయితే చాలా సంవత్సరాల క్రితం పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ తో 143 అనే సినిమాను తెరకెక్కించారు.
కథ, కథనం బాగానే ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది.సాయిరాం శంకర్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ లేకపోవడం, కథ కథనంలో చిన్నచిన్న లోపాలు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఒక విధంగా కారణమయ్యాయని చెప్పవచ్చు.
అయితే మరి కొందరు మాత్రం టైటిల్ విషయంలో మేకర్స్ పొరపాటు చేశారని ఈ సినిమాకు మరో మంచి టైటిల్ ఫిక్స్ చేసి ఉంటే ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధించేదని వెల్లడించారు.పూరీ జగన్నాథ్ సినిమాలలో చాలా సినిమాలు టైటిల్స్ వల్లే హిట్టయ్యాయి.అయితే ఈ సినిమా విషయంలో మాత్రం పూరీ జగన్నాథ్ పొరపాటు చేశారనే చెప్పాలి.