ఏలూరు( Eluru )లో జనసేన కార్యకర్తలు నిరసనకు దిగారు.ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఏలూరు సీటు వ్యవహారంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పునరాలోచించాలని శ్రేణులు కోరుతున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గ సీటును టీడీపీ( TDP )కి కేటాయించడాన్ని నిరసిస్తున్న జన సైనికులు తాడేపల్లిగూడెం( Tadepalligudem ) సభను బహిష్కరించారు.కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవన్ నిర్ణయం ఉందని మండిపడ్డారు.అయితే తాడేపల్లిగూడెం సభను టీడీపీ – జనసేన ఉమ్మడిగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.