జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆదివారం రోజున జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం అధికారులు,పోలీస్ సిబ్బంది ప్రొ.జయశంకర్ సార్ చిత్రపటం వద్ద పూలను వుంచి తమ నివాళులను ఆర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు.

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.ఆయన జీవితం నేటి యువ‌త‌కు ఆద‌ర్శప్రాయం, స్ఫూర్తిదాయకమన్నారు.

Advertisement

ఆయన స్పూర్తితో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి,జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News