రిషబ్ పంత్ కారు ప్రమాదం పై స్పందించిన ప్రధాని మోడీ..!!

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఈరోజు కారు ప్రమాదానికి గురి కావడం తెలిసిందే.ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ నీ ఢీకొట్టడం జరిగింది.

 Prime Minister Modi Reacts On Rishabh Pant Car Accident Details, Pm Modi, Risha-TeluguStop.com

దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.వెంటనే కారులో నుండి పంత్ దూకేసి తన ప్రాణాలను కాపాడుకున్నాడు.

ఈ క్రమంలో స్థానికులు గుర్తించి రిషబ్ నీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

తెల్లవారుజామున ఐదున్నర గంటలకు జరిగిన ఈ ఘటన క్రీడాలోకాన్ని కుదిపేసింది.

అయితే ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు.ఈరోజు ఆయన తల్లి మరణం తాలూకు విషాదంలో ఉన్నప్పటికీ రిషబ్ పంత్ యాక్సిడెంట్ లో గాయపడిన వార్త తనని కలిసి వేసినట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదానికి గురికావడం తనకు ఎంతో విచారాన్ని కలిగించిందని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.రిషబ్ వెంటనే స్పందించి క్షేమంగా ఆయురారోగ్యాలతో కోలుకుని త్వరగా రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube