మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తారలు ఆ తర్వాత కాలంలో కనుమరుగైపోవడం అన్నది కామన్.కొంతమంది అలాగే సినిమాలలో కంటిన్యూ అవుతుండగా మరి కొంత మంది అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీలకు దూరమవుతూ ఉంటారు.
ఇంకొందరు కొన్ని కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరం అవుతూ ఉంటారు.అటువంటి వారిలో ప్రీతి జింగానియా( preeti jhangiani ) కూడా ఒకరు.
ఒకప్పుడు తమ్ముడు( Thammudu ) నరసింహనాయుడు, అప్పారావు, డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ప్రీతి జింగానియా.

ఆ తర్వాత టాలీవుడ్ లో సరిగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ( Bollywood )కి చెక్కేసింది.తర్వాత మళ్ళీ ఒకసారి తేజం సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో చేసింది.2007లో వచ్చిన విక్టోరియా నెం.203 సినిమా తర్వాత మరే హిందీ చిత్రంలోనూ కనిపించలేదు.బాలీవుడ్కు గుడ్బై చెప్పిన ఆమె ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.
ఇందులో భాగంగానే ఫాస్ వెబ్ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చింది.ఇదిలా ఉంటే నిజంగా ప్రీతీ తాను సినిమాలకు దూరం అవన్నీ గల కారణం ఏంటి అన్న విషయాలను తెలిపింది.
ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ.నేను కోరుకున్న రోల్స్ నాకు రాలేదు.
నాకు వచ్చిన పాత్రలతో నేను సంతోషంగా లేను.

సినిమాలో కీలకమైన పాత్ర చేయాలని ఉండేది.అలా అని సినిమాలో నేనే హైలైట్ అవ్వాలని చెప్పడం లేదు.కనీసం కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి అంటున్నాను.
అదే నేను కోరుకుంది.కానీ అటువంటి పాత్రలు నా దాకా రానేలేదు.
అలాంటప్పుడు ఏదో ఒకటి నేను నిరాశకు లోనవడం, నా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని ఒక అడుగు వెనక్కు వేశాను.విక్టోరియా నెం.203 తర్వాత నేను ఏ హిందీ సినిమా చేయలేదు, కానీ పలు ప్రాంతీయ భాషల్లో నటించాను.ఈవెంట్లు, షోలు.
ఇలా చాలా చేశాను.కాబట్టి సినిమాలకు నేను దూరంగా ఉన్నానని ఎప్పుడూ ఫీలవలేదు.
కాకపోతే బాలీవుడ్ చిత్రాల్లో నటించడాన్ని మిస్ అయ్యాను.ఇప్పుడు నేను తిరిగొచ్చేశాను, మళ్లీ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను.
సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది ప్రీతి జింగానియా.







