గడచిన మూడు సంవత్సరాలు కాలంగా పార్టీ మారుతున్నానంటూ నా మీద దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.వారి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మడం మానేసారు.
అయినా ఈరోజు మళ్లీ నా మీద పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారానికి తెర తీశారు.ఈరోజు నేను స్థానికంగా చిలకలూరిపేట లోనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండగా వైసీపీలో చేరడానికి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళుతున్నట్టుగా ఒక కథనాన్ని యూట్యూబ్ ఛానల్ వేదికగా సృష్టించి నాపై మళ్ళీ అదే దుష్ప్రచారానికి తెర తీశారు.
అలవి గాని హామీలతో అధికారంలోకి వచ్చారు.వాటిపై సమాధానాలు చెప్పుకోలేక ఇప్పుడు చిలకలూరిపేటలో నాపై దుష్ప్రచారానికి తెర తీసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి నాపై ఇలాంటి ప్రచారాలకు పూనుకొన్నారు.ఇది ఈరోజు కొత్త కాదు గడచిన మూడు సంవత్సరాలుగా ఇలాగే నాపై దుష్ప్రచారాలకు తెర తీశారు.