రౌద్రం రణం రుధిరం( RRR ) సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ ( NTR )ఈయన నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించు కున్నాడు.
అంతేకాదు ఇటీవలే ఈ సినిమాకు ఆస్కార్ రావడంతో మరోసారి ఎన్టీఆర్ పేరు మారుమోగి పోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ (NTR30) సినిమాను ప్రకటించాడు.కొరటాల సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యురల్ షూట్ కు వెళ్లనుంది అని క్లారిటీ వచ్చింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ ( NTR31 ) సినిమాను కూడా ఎవరితో చేయబోతున్నారో ప్రకటించారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel) దర్శకత్వంలో ప్రకటించాడు.ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో భారీ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కిస్తున్నట్టు హాలీవుడ్ టెక్నీషన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నట్టు తెలుస్తుంది.అంతేకాదు అంతర్జాతీయ స్థాయి నటీనటులను కూడా తీసుకునే ఆలోచనలో నీల్ ఉన్నారట.మొత్తానికి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో భారీ యాక్షన్ డ్రామా రాబోతుంది.
ఇదే నిజమైతే ఎన్టీఆర్ రేంజ్ హాలీవుడ్ ( Hollywood ) రేంజ్ కు చేరిపోవడం ఖాయం.