టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట అ సినిమాతో అందరినీ అబ్బుర పరిచిన ప్రశాంత్ వర్మ, మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.
అదేవిధంగా టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు.మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కడంతో ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలు చేశాడు.
ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.ప్రశాంత్ వర్మ కూడా ఆ రెండు సినిమాలతో మళ్లీ తన మార్క్ ని నిలబెట్టుకున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మరొక వెరైటీ స్క్రిప్టు తో రెడీ అవుతున్నారు.అయితే ఈసారి ఏకంగా పది మంది హీరోయిన్ లతో ఒక కథను రెడీ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ.
మామూలుగా సినిమాల్లో ఒకరు లేదా ఇద్దరు లేదంటే ముగ్గురు హీరోయిన్ లు నటిస్తూ ఉంటారు.కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఏకంగా 10 మంది హీరోయిన్లతో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ని ఎంచుకో బోతున్నారు.
అయితే అందులో ఒక పాత్రకీ మరో పాత్రకీ ముడివేసి చివర్లో ఆ చిక్కులన్నీంటిని తన స్క్రీన్ ప్లే మ్యూజిక్ తో రిలీజ్ చేసేలా డిజైన్ చేశాడు.ఇందుకోసం ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ను కూడా రాసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఆ పది మంది హీరోయిన్ల కాన్సెప్టు లో భాగంగా ఇప్పటికే ఒక హీరోయిన్ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అనుపమ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇకపోతే మిగిలిన ఆ తొమ్మిది మంది హీరోయిన్లను కూడా మంచి పాపులారిటీ ఉన్న వారిని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
అయితే ఈ విషయం తెలిసిన తరువాత ఈ సినిమా ఎలా ఉండబోతోంది, అసలు కాన్సెప్ట్ ఏమిటి? మిగిలిన తొమ్మిది మంది హీరోయిన్లు ఎవరు? 10 మంది హీరోయిన్లతో ఆ సినిమాను ఎలా తెరకెక్కించబోతున్నారు? లాంటి విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.