'ఆదిపురుష్'కు గుమ్మడికాయ కొట్టిన టీమ్.. ఇక అనుకున్న టైంకే!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఒకటి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.ఇక ఎట్టకేలకు ప్రభాస్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముగించేసి గుమ్మడి కాయ కొట్టినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్రలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాలోని ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ లు తమ పాత్రల షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఇక ఇప్పుడు టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టినట్టు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఈ సినిమా షూటింగ్ ను 2021 ఫిబ్రవరి 2న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి అదే నెలలో రెగ్యురల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి కేవలం 108 రోజుల్లోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసేసాడు ఓం రౌత్.ఇక ఇంత పక్కా ప్లానింగ్ తో షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న సమయానికి పూర్తి చేసారు.

Advertisement

ఒక పది నెలల పాటు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే కేటాయించడం జరిగింది.

ఎందుకంటే ఈ సినిమా లో భారీ విజువల్ గ్రాఫిక్స్ ఉండడంతో షూటింగ్ పార్ట్ ను తొందరగా పూర్తి చేసి ఇక దీని మీద ఫోకస్ చేయబోతున్నారు.ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని గ్రాండ్ విజువల్ వండర్ ను ఆదిపురుష్ సినిమా ద్వారా చూపించ బోతున్నాడు ఓం రౌత్.ఇక అంత అనుకున్న సమయానికే పూర్తి అవుతుంది కాబట్టి ముందుగా ప్రకటించిన తేదీకే ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఈ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు