ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నా కే జి ఎఫ్ 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.కన్నడ సినిమా కే జి ఎఫ్ 2 సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.వందల కోట్ల వసూళ్లు రావడంలో ఎలాంటి అనుమానం లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కచ్చితంగా ఊహించిన దాని కంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టే అవకాశముందంటూ ప్రతి ఒక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చిన నేపధ్యంలో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన కే జి ఎఫ్ 2 సినిమా హిట్ అయితే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను మొదటి నుండి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కే జి ఎఫ్ 2 సినిమా సక్సెస్ కారణంగా ప్రభాస్ సినిమా పై కచ్చితంగా భారీ అంచనాలను కలిగి ఉంటుందని నమ్మకం వ్యక్తం అవుతుంది.
సలార్ కూడా భారీగా వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రశాంత్ నీల్ మరో అద్భుతమైన సినిమాను కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తాడనే నమ్మకాన్ని మరియు మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా కే జి ఎఫ్ 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.400 కోట్లు చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ సినిమా లో ప్రభాస్ కి జోడీగా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే.కే జి ఎఫ్ 2 సినిమా కు మించిన యాక్షన్ సన్నివేశాలు మాస్ ఎలిమెంట్స్ ఉంటాయనే నమ్మకం ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది ఆరంభం లో ప్రభాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా నిరాశ పరిచింది.కనుక ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది.
త్వరలోనే మరింత షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది.