మధుమేహం లేదా డయాబెటిస్.నేటి కాలంలో ప్రపంపవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని పీడిస్తున్న సమస్య ఇది.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు చేయకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల మధుమేహం వ్యాధి బారిన పడుతుంటారు.ఇక మధుమేహం ఉన్న వారు ఎల్లప్పుడు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మధుమేహం రోగులు బ్లడ్ షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుకోవాలి అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వింటర్ సీజన్లో మధుమేహం రోగులు ఉదయం బ్రేక్ ఫాస్ట్లో ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
అంటే ఉడకపెట్టిన గుడ్డు, బాదం, పాలు, చిలగడదుంప, పియర్ పండు, యాపిల్ పండు వంటివి తీసుకోవచ్చు.అలాగే మధ్యాహ్నం లంచ్లో బ్రైన్ రైస్, మల్టీగ్రెయిన్ చపాతీలతో పాటు ఆకుకూరలు తీసుకోవాలి.
ముఖ్యంగా పాల కూర, మెంతి కూర, తోట కూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు తీసుకోవాలి.మరియు క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ వంటివి కూడా తీసుకోవాలి.
ఇక రాత్రి తీసుకునే ఫుడ్లో కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.ముఖ్యంగా ఓట్స్, పుళ్కాలు, చపాతీలు వంటివి తీసుకోవాలి.మరియు రాత్రివేళ మజ్జిగ మాత్రమే తీసుకోవాలి.పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు రాత్రివేళ మధుమేహం రోగులు అస్సలు తీసుకోకూడదు.
అలాగే ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఆయిల్ ఫుడ్ లేకుండా చూసుకోవాలి.
అదేవిధంగా, వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు అయినా చేపలు తీసుకోవాలి.
ముఖ్యంగా సాల్మాన్, ట్యూనా లాంటి చేపలు ఎక్కువగా తీసుకోవాలి.ఇక పండ్లలో అవకాడో, పైనాపిల్, దానిమ్మ పండు, ఉసిరి, చెర్రీస్, నిమ్మ జాతి పండ్లు వంటివి తీసుకుంటే.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉంటాయి.