పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ఆది పురుష్ (Adipurush) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక(Pre Release Event) ను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
లక్షల సంఖ్యలో అభిమానులు ఈ వేడుకకు తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ… ఒకసారి చిరంజీవి(Chiranjeevi) గారు నన్ను కలిసినప్పుడు రామాయణం(Ramayanam) చేస్తున్నావా అని అడిగారు.అవును అని నేను సమాధానం చెప్పగా రామాయణం చేయాలి అంటే అదృష్టం ఉండాలని చిరంజీవి గారు అన్నారు.నిజంగానే ఈ సినిమా చేయడం నా అదృష్టం.ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తాను తక్కువ మాట్లాడుతూ ఎక్కువ సినిమాలు చేస్తానని అన్నారు.ఇక ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ ఉండగా అభిమానులు మరోసారి ప్రభాస్ పెళ్లి(Marriage) గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.
అన్న పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నించడంతో ప్రభాస్ సమాధానం చెబుతూ తాను ఇక్కడే తిరుపతిలో(Tirupathi) ని పెళ్లి చేసుకుంటానని,తన పెళ్లి ఎప్పుడైనా ఇక్కడే చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో ప్రభాస్ రాముడు(Ramudu) పాత్రలో నటించగా కృతి సనన్ సీతమ్మ(Seethamma) పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ అద్భుతమైన ఆదరణ పొందుతుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.