బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Rauth ) దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”( Adipurush ).ఈ పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను రాముడి పాత్రలో వెండితెర మీద చూస్తామా అని ఎదురు చూడని అభిమాని లేరు.
అయితే ఆదిపురుష్ టీమ్ మాత్రం ఫ్యాన్స్ కు అసంతృప్తి తెప్పిస్తున్నారు.
వీరు ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.పాన్ ఇండియా సినిమాలకు రెండు లేదా మూడు నెలల ముందుగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు.
కానీ ఆదిపురుష్ ఇంకా రిలీజ్ కు రెండు వారాలు మాత్రమే ఉన్న పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ కనిపించడం లేదని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.
తెలుగు, హిందీ అంటే పర్వాలేదు కానీ మిగిలిన భాషల్లో కూడా ప్రమోషన్స్ లేకపోవడం నిరాశకు గురి చేస్తుంది.ప్రభాస్ కూడా గత సినిమాలు రిలీజ్ సమయంలో వరుస ఇంటర్వ్యూలు చేసాడు.లెక్కలేనన్ని టూర్స్ కూడా వేశారు.
కానీ ఆదిపురుష్ విషయంలో ఇప్పటికే సమయం దగ్గర పడుతున్న ఇంకా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు.
జూన్ నుండి స్టార్ట్ చేయనున్నారు అని తెలుస్తున్న ఫ్యాన్స్ లో మాత్రం అసంతృప్తి అలాగే ఉండిపోయింది.ఇక తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సీత పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.
అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.