టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్( Adipurush )’.హిందీ మరియు తెలుగు భాష ల్లో ఈ సినిమా ను రూపొందించిన విషయం తెల్సిందే.రూ.550 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను ప్రభాస్( prabhas ) హీరోగా రూపొందించడం కు కారణం ఏంటి అంటూ దర్శకుడు ఓం రౌత్( Om Raut ) మరియు నిర్మాత ను ప్రశ్నించిన సమయంలో అనూహ్యంగా వారు చెప్పిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రభాస్ ని మించిన వారు రాముడి పాత్రకు ఎవరు లేరు అని మేము అనుకున్నాం.అందుకే ఆదిపురుష్ సినిమా గురించి అనుకున్న సమయంలో బాహుబలి హీరో నే గుర్తుకు వచ్చాడు.
అంతటి గొప్ప వ్యక్తి అతడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు వారి యొక్క వ్యాఖ్యలను తెగ షేర్ చేస్తున్నారు.రాముడు అంటే బుద్ది మంతుడు.టాలీవుడ్ లో రాముడి మాదిరిగా బుద్ది మంతుడు బూతద్దం పెట్టినా ప్రభాస్ మినహా మరెవ్వరు లభించరు అని.కనుక వారికి ప్రభాస్ మాత్రమే ఆప్షన్ అయ్యి ఉంటాడు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా( Social media )_లో ప్రభాస్ యొక్క గొప్ప తనం గురించి అభిమానులు ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు.
అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా చర్చ జరుగుతోంది.పెద్ద ఎత్తున ప్రభాస్ యొక్క మంచి తనం గురించి.అతడి యొక్క గొప్పతనం గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి.ఈ రేంజ్ లో ప్రభాస్ గురించి మాట్లాడుకోవం ఇప్పుడు అభిమానులందరికి కూడా చాలా సంతోషంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లు ఈ సినిమా సాధించబోతుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.