యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది.ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తనదైన మార్క్ వేసుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాను పీరియాడికల్ లవ్స్టోరీగా జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సనిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఎమోషనల్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్లైమాక్స్ మరింత ట్రాజెడీగా ఉండనుందట.ఈ క్లైమాక్స్లో ఒక ప్రభాస్ చనిపోతాడని తెలుస్తోంది.
ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుందని, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ అల్ట్రా మాడ్రన్ లుక్ ఫ్యాన్స్కు పెద్ద ట్రీట్గా మారనుంది.
ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే నటిస్తోందట.గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తు్న్నాయి.