రేపు గాంధీభవన్ లో ప్రారంభంకానున్న పోస్ట్ కార్డ్ ఉద్యమం

హైదరాబాద్ గాంధీభవన్ లో రేపు పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభం కానుంది.ఈ మేరకు ఉద్యమాన్ని ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ప్రారంభించనున్నారు.

 Post Card Movement To Be Started Tomorrow At Gandhi Bhavan-TeluguStop.com

ఈనెల 7వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుతుబ్ షాయి గ్రౌండ్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు.రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఈనెల 8న మంచిర్యాలలో నిరసస కార్యక్రమం చేపట్టనున్నారు.

తిరిగి ఈనెల 10 నుంచి హాత్ సే హాత్ జోడోయాత్రను పునః ప్రారంభింస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా జహీరాబాద్ లో మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో యాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు అండగా ఏప్రిల్ 25న గజ్వేల్ లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube