రేపు గాంధీభవన్ లో ప్రారంభంకానున్న పోస్ట్ కార్డ్ ఉద్యమం

హైదరాబాద్ గాంధీభవన్ లో రేపు పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభం కానుంది.ఈ మేరకు ఉద్యమాన్ని ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ప్రారంభించనున్నారు.

ఈనెల 7వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుతుబ్ షాయి గ్రౌండ్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఈనెల 8న మంచిర్యాలలో నిరసస కార్యక్రమం చేపట్టనున్నారు.

తిరిగి ఈనెల 10 నుంచి హాత్ సే హాత్ జోడోయాత్రను పునః ప్రారంభింస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

అదేవిధంగా జహీరాబాద్ లో మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో యాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు అండగా ఏప్రిల్ 25న గజ్వేల్ లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

పది పరీక్షలలో 594 మార్కులు సాధించిన రైతుబిడ్డ హర్షిత.. విద్యార్థిని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!