తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, ఎమ్మెల్యే గణేష్ కుమార్, మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ఎలక్షన్ కమీషనర్ గోపాలకృష్ణ, ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ కుమార్ నిషద్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.







