కేంద్రంలో బీజేపీ ‘హిందూ సెంటిమెంట్’తో, తెలంగాణలో టీఆర్ఎస్ ‘ప్రాంతీయ, హిందూ-ముస్లిం భాయ్ భాయ్ సెంటిమెంట్’తో పాలన సాగిస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ‘యాంటీ కమ్మ-రూల్ సెంటిమెంట్’తో పాలన సాగిస్తోంది.ఈ ‘సెంటిమెంట్ డ్రామా’ ఏమిటి? సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజలు ఓట్లు వేయరా? ‘సెంటిమెంట్’కు లొంగిపోతారా? దీని తెలుసుకోవడానికి ముందు, అసలు ఈ దేశంలో ఏమి జరుగుతుందో? గేమ్చేంజర్లు ఓటర్ల మనస్తత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలుసుకుందాం.ఇప్పుడు రాజకీయ చదరంగంలో రాజకీయ నాయకులు ప్రధాన అస్త్రం ‘సెంటిమెంట్’.
USAలోని ‘రెడ్’, ‘బ్లూ’ల నేపథ్యంతో రాజకీయం నడుస్తుంటే.
భారతదేశంలో ఎన్నికలు కేవలం ‘సెంటిమెంట్’ రాజకీయంతో నడుస్తున్నాయి.USAలోని డెమొక్రాట్లు, రిపబ్లిక్ల మాదిరిగానే, భారతదేశం కూడా రాజకీయ పార్టీలు మతపరమైన, లౌకిక భావాలను కలిగి ఉంటాయి.
ప్రజలు కేవలం ‘సెంటిమెంట్’ కోసమే ఓటు వేస్తారు కానీ సంక్షేమం, అభివృద్ధి కోసం కాదనే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.తిరిగి అసలు టాపిక్కి వస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశమంతటా ‘మత భావాన్ని,జాతీయ వాదాన్ని విస్తరిస్తూ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తుంది.
అయితే అన్ని రాష్ట్రాల్లో అమలు కాదు.
ముఖ్యంగా దక్షాణిదిలో మతం పేరిట ఓట్లు సాధించడం చాలా కష్టం.తెలంగాణ రాష్ట్రంలో, బిజెపి హిందుత్వ సెంటిమెంట్న కాకుండా ‘ప్రాంతీయ సెంటిమెంట్’ను వాడుకోకపోతే టిఆర్ఎస్ను ఎదుర్కొవడం చాలా కష్టం.ఇక ఏపీకి వస్తే వైఎస్ జగన్ ‘ యాంటీ కమ్మ’ అనే నినాదంతో పనిచేస్తున్నారు.
టీడీపీ వ్యతిరేక మైండ్సెట్లన్నింటినీ పోలరైజ్ చేస్తూ పార్టీని, ప్రతి పక్షాలను కార్నర్ చేస్తూ వెళుతున్నారు.ఈ ప్లాన్తో 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించారు.2024 సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే వెళ్ళనున్నారు.