కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తరచూ పశువులపై దాడులకు పాల్పడుతున్నాయన్న నేపథ్యంలో పులులపై విష ప్రయోగం చేశారని తెలుస్తోంది.
ఈ మేరకు నలుగురు పశువుల కాపరులు పులులను చంపాలని ప్లాన్ చేశారని అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.
విష ప్రయోగంతో ఇప్పటికే రెండు పులులు మృత్యువాత పడగా మరో పులి కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.