భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గాండ్లగూడెంలో ఉద్రిక్తత నెలకొంది.అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది.
వ్యవసాయ పనులకు వెళ్లకుండా రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.దీంతో పురుగుల మందు డబ్బాలు పట్టుకుని రోడ్డుపై పోడు రైతులు నిరసనకు దిగారు.
అనంతరం పొలాల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్స్ వెహికల్స్ వెళ్లకుండా నిలిపివేశారు.ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.