బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు.ఆమెకు ఉన్న ప్రేమ విషయాల గురించి తెలిసి కూడా అభిషేక్ బచ్చన్ ఆమెన వివాహం చేసుకున్న కారణంగా ఇద్దరి మద్య ఎప్పుడు ఎలాంటి వివాదం రాదని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
వీరు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారని, ఇద్దరికి ఇద్దరు సహకారం చేసుకుంటు ఉంటారని బాలీవుడ్లో టాక్ ఉంది.వీరిద్దరు కలిసి ఎప్పుడు బయటకు వెళ్లినా కూడా ఆ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తాయి.
ఇక ఇప్పుడు వీరికి కూతురు ఆరాధ్య కూడా జాయిన్ అయ్యింది.తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ ఫ్యామిలీ అందరి దృష్టిని ఆకర్షించారు.కార్యక్రమంలో వీరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఐశ్వర్యరాయ్ ఒక పర్ఫెక్ట్ గృహిణిగా కనిపించగా, ఆరాధ్య క్యూట్గా ఉండటంతో పాటు అభిషేక్ బచ్చన్ మ్యాన్లీగా ఉండి ఆకట్టుకున్నాడు.
మొత్తానికి ముగ్గురు కూడా చూస్తూనే ఉండాలనిపించేలా ఉన్నారు.ఈ ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.