ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో( Ghaziabad ) దారుణం చోటు చేసుకుంది.అతివేగంగా వచ్చిన ఎస్యూవీ కుక్కను( Dog ) తొక్కేసింది.
ఈ విషాద ఘటనలో కుక్క అక్కడికక్కడే మరణించింది.ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది, వెహికల్ చక్రాల కింద కుక్క నలిగిపోయిన భయంకరమైన దృశ్యం వీడియోలో రికార్డయింది.
మరణించిన కుక్క పేరు పగ్ అని తెలిసింది.
ఇందిరాపురంలోని నీతి ఖండ్ 1లోని ఒక లేన్లో నడుస్తున్న యజమానితో కలిసి ఇది వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఆ యజమాని ఒక యువకుడు.తన మొబైల్ ఫోన్ను( Mobile Phone ) చూస్తూ రోడ్డు దాటుతున్నాడు.ఆ సమయంలో అతడు దృష్టి అంతా మొబైల్ పైనే ఉండటంతో సొసైటీలోకి ప్రవేశిస్తున్న నల్లటి టాటా నెక్సాన్ కారును( Tata Nexon Car ) గమనించలేదు.ఆ కారు తప్పి రోడ్డుపై తిరుగుతున్న కుక్క కారును ఢీకొట్టింది.
ఈ దాడిలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన ఎస్యూవీ డ్రైవర్పై కుక్క యజమాని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.డ్రైవర్ చాలా అహంకారి అని, పరిహారంగా అలాంటి మరొక కుక్కని కొనుగోలు చేసి ఇస్తాననే చెడ్డ కూతలు కూసాడని బాధితుడు చెప్పాడు.పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు.కుక్క మృతికి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

కుక్క యజమాని కూడా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించి నిండు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.అతను తన పెంపుడు జంతువుపై మరింత శ్రద్ధ వహించి, ట్రాఫిక్ నుండి దూరంగా ఉంచాల్సింది.అతను కుక్క కోసం గొలుసుకు బదులుగా సరైన కాలర్ని కూడా ఉపయోగించాలి.అతని అజాగ్రత్త వల్ల అన్యాయంగా మూగ జీవి చనిపోయింది.







