నానాటికీ ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.ముఖ్యంగా వంటగ్యాస్ ధర విపరీతంగా పెరిగింది.
దీంతో గ్యాస్ అయిపోయిందని తెలియగానే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.సబ్సిడీలను ప్రభుత్వం తీసేయడం, భారీ ధరకు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి రావడం సామాన్యులకు భారంగా మారింది.
ఇటువంటి పరిస్థితుల్లో పేటీఎం సంస్థ గ్యాస్ వినియోగదారులకు బంపరాఫర్ అందిస్తోంది.ప్రత్యేక ఆఫర్ కింద రూ.2700ల క్యాష్ బ్యాక్ను అందజేస్తోంది.పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికి 100 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వడం పలువురిని ఆకర్షిస్తోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
‘పేటీఎం’ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే వారిపై సంస్థ కళ్లు చెదిరే ఆఫర్ ఇస్తోంది. పేటీఎంతో ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే కస్టమర్లు రూ.2,700 వరకు నేరుగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.ఫిన్టెక్ కంపెనీ ‘3 పే 2700 క్యాష్బ్యాక్’ అనే కొత్త ఆఫర్ను ప్రారంభించింది.ఇందులో కొత్త కస్టమర్లు మూడు వేర్వేరు నెలల పాటు గ్యాస్ సిలిండర్లను వరుసగా బుకింగ్ చేస్తే రూ.2700 వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు.ఆఫర్ కింద, పేటీఎం తన యాప్ ద్వారా మొదటిసారి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే కస్టమర్లను మూడు వేర్వేరు నెలల్లో వరుసగా మూడు బుకింగ్లకు రూ.900 క్యాష్బ్యాక్ను పొందేందుకు అనుమతిస్తుంది.ఆఫర్ నిబంధనలు, షరతుల ప్రకారం కొత్త వినియోగదారులకు క్యాష్బ్యాక్ రూ.10 నుండి రూ.900 వరకు ఉంటుంది.పాత కస్టమర్లు ప్రతి బుకింగ్పై కూడా రివార్డ్లను పొందవచ్చు.ఆన్లైన్లో గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడానికి వారు 5000 క్యాష్బ్యాక్ పాయింట్లను పొందవచ్చు.Paytm వాలెట్ లేదా ఇతర ఉత్తేజకరమైన డీల్లు లేదా వోచర్లలో డబ్బు కోసం పాయింట్లను రీడీమ్ చేయవచ్చు.ఇలా పెరిగిన గ్యాస్ ధరల నుంచి వినియోగదారులకు పేటీఎం వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఊరటనిస్తోంది.