' కాపు' వ్యూహం ఫలిస్తే ? పవనే సీఎం 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎక్కడ ఏ బహిరంగ సభ నిర్వహించినా.భారీగా అభిమానులు తరలిరావడంతో పాటు, సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు.

 Pawan Kalyan Strategy Behind Mentioning Kapus At Janasena Formation Day Details,-TeluguStop.com

ఒక్కో సందర్భంలో పవన్ ఆ నినాదాలను వారిస్తూ ఉంటారు.మరో సందర్భంలో ఆ నినాదాలు చేయాల్సిందిగా పవన్ కోరుతూ ఉంటారు.

ఇది ప్రతి సభలోను ఇది సర్వ సాధారణంగానే మారిపోయింది అయితే ఇప్పుడు అభిమానుల కోరిక తీర్చే వ్యూహానికి పవన్ సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు.ఎప్పుడూ లేని విధంగా  కులాల ప్రస్తావన తెరపైకి తీసుకొస్తున్నారు.

ఎప్పుడూ రెండు కులాల మధ్యనే రాజ్యాధికారం ఉండాలా అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు.దీనిలో భాగంగానే తన సొంత సామాజిక వర్గమైన ‘ కాపు ‘( Kapu ) అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.

కాపులంతా ఐక్యంగా ఉండి తనకు అండగా నిలబడాలని పవన్ బహిరంగంగానే పిలుపునిస్తున్నారు.

తాజాగా మొన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన ( Janasena ) పదో ఆవిర్భావ సభలో పవన్ కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

దీంతో అంతా ఆశ్చర్యపోయారు.కుల రహిత సమాజం కావాలంటూ గతం నుంచి పవన్ చెబుతూ వచ్చారు.అయితే ఇప్పుడు ఆకస్మాత్తుగా కులాల అంశాన్ని తెరపైకి తేవడం , ముఖ్యంగా కాపుల ప్రాధాన్యాన్ని పవన్ ప్రస్తావించడం సంచలనంగా మారింది.రాజకీయాల్లో కీలకంగా ఉన్నవారు ఎవరు బహిరంగ వేదికలపై కుల ప్రస్తావన తీసుకురారు.

అలా తీసుకొస్తే మిగతా కులాలకు వ్యతిరేకం అవుతామనే కారణం.కానీ పవన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.ఏపీలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని, అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం రావాలంటే జనసేన పాలన రావాలని చెబుతూ.

కాపుల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan

మార్పు రావాలంటే కాపులంతా ఐక్యంగా ఉంటూ.పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో కాపులంతా ఏకతాటిపైకి వచ్చారు.

చిరంజీవి( Chiranjeevi ) ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయంతో వారంతా అండగా నిలబడ్డారు.అయితే అప్పట్లో కాంగ్రెస్, టిడిపి, ప్రజారాజ్యం పార్టీల మధ్య ఓట్ల చీలిక రావడంతో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

అయినా 18 అసెంబ్లీ స్థానాలను ప్రజారాజ్యం గెలుచుకుంది.ఆ తర్వాత తలెత్తిన అనేక ఇబ్బందికర పరిస్థితుల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యంను విలీనం చేశారు.

దీనిపై కాపులలోను అసంతృప్తి చెలరేగింది .ఇక ఆ తరువాత కాపు సామాజికవర్గంలో కీలకంగా ఉన్న చాలామంది నాయకులు వివిధ పార్టీల్లో చేరిపోయారు.ఇప్పుడు అటువంటి వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, జనసేనకు అండగా నిలబడే విధంగా చేసుకోవాలనే ప్రయత్నాలు పవన్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan

2019 ఎన్నికల్లో కాపులు జనసేనకు అండగా నిలబడకపోవడంతో, ఆ పార్టీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది.ఇకపై ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందుగానే కాపు సామాజిక వర్గం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, తనకు మద్దతు ఇచ్చే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతోపాటు మిగతా కులాలను కలుపుకు వెళ్లే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.

ఏపీలో ఏ పార్టీ గెలవాలన్న కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం.అందుకే ఇప్పటి నుంచే సొంత సామాజిక వర్గం అండదండలు జనసేనకు ఉండే విధంగా పదే పదే ‘ కాపు ‘ రాగం పవన్ వినిపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 ఇక ఆ సామాజికవర్గం అండ పూర్తిగా ఉంటే టీడీపీ తో పొత్తు పెట్టుకున్నా.వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించవచ్చని, అలాగే సీఎం సీటు ఇస్తేనే పొత్తు అనే కండిషన్ విధించవచ్చనే లెక్కల్లో పవన్ ఉన్నారట.

తమ డిమాండ్లకు తలొగ్గడం మినహా టీడీపీ కి మరో ఆప్షన్ ఉండదనే అంచనాలో పవన్ ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube