కోనసీమ జనసేనకి బలం ముమ్మిడివరంలో పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న “వారాహి విజయ యాత్ర” ( Varahi Vijayatra )ముమ్మిడివరంలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా బుధవారం ముమ్మిడివరంలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Pawan Kalyan Sensational Comments In Mummidivaram Varahi , Vijaya Yatra Janasen-TeluguStop.com

కోనసీమ అంటే జనసేనకు బలం.కోనసీమకు కోపం వస్తే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది.కోనసీమ తిండి తిన్నవారికి ఉద్వేగం ఉంటుంది.కానీ దాని వెనక నిజాయితీ ఉంటుంది.రాజకీయాల్లో భయం లేకుండా మాట్లాడటం నాకిష్టం.100 మంది కష్టాన్ని 30, 40 మందికి పంచుతున్నారు.ఇకనుండి ఉభయ గోదావరి జిల్లాలకు కోనసీమకు అందుబాటులో ఉంటాను అనీ పవన్ స్పష్టం చేశారు.

ఆల్రెడీ రాజమండ్రిలో జనసేన పార్టీ( Janasena party ) ఆఫీస్ స్థాపించడం జరిగింది.ఇది నా నేల.నా గోదావరి.గోదావరి ఈ నేల నుండి ఎలా పారిపోలేదో… అలాగే పవన్ కళ్యాణ్ కూడా పారిపోడు అనే మాట ఇస్తున్నాను అని స్పష్టం చేశారు.ఆంధ్రాకి వైసీపీ అనేది వైరస్ లాంటిది అని పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో కోనసీమలో రైతులు అనేక ఇబ్బందులు.ఎదుర్కోవటం జరిగింది.

కేసులు ఉన్న ముఖ్యమంత్రి ప్రజల కోసం జాతీయస్థాయిలో ఎలా పోరాడగలడు.?, కాబట్టి ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని ఆదరించి చూడండి.జాతీయస్థాయిలో నేనంటే అభిమానించే నాయకులు ఉన్నారు.అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తాను అని ముమ్మిడివరం “వారాహి విజయ యాత్ర”లో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube