సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయంలో బాగా దిగజారిపోతూ ఉంటారు.ముఖ్యంగా వారి పెళ్లి విషయాలలో మాత్రం వారి ఆలోచనలు చాలా దారుణంగా ఉంటాయి.
అసలు ఏంటో కానీ ఒక్క పెళ్లితో సరిపెట్టుకోకుండా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని బజారుకెక్కుతారు.ఇక వయసులో ఉన్న వాళ్ళే కాకుండా వయసు మీద పడ్డ వాళ్ళు కూడా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని సమాజాన్ని నాశనం చేస్తున్నారు.
ఆమె ఇష్ట పడిందే మూడో భార్య వ్యక్తిని.ఆమె ఆ పని చేయడమే పెద్ద తప్పు మళ్లీ ఆమెను టార్గెట్ చేస్తున్నారు అంటూ అది కాకుండా ఆ వ్యక్తి మూడవ భార్యనే తనను టార్గెట్ చేసి వార్తలలో నిలబెడుతుంది అని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం.
ఏంటో ఈ సమాజం ఎక్కడ పోతుందో అర్థం అవడం లేదు కానీ రోజురోజుకు మాత్రం బాగా దిగజారిపోతుంది అని అర్థమవుతుంది.
ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా పవిత్రమైన పవిత్ర లోకేష్, నరేష్ ల గురించే.
గత కొన్ని రోజుల నుండి ఈ జంట టాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ గా మారింది.ఎప్పుడైతే వీళ్ళు ఒక హోటల్లో దొరికారో అప్పటినుంచి వీరి వ్యవహారం బయటపడుతూనే ఉంది.
అప్పటివరకు తోటి నటీనటులుగా కనిపించిన వీళ్లు ఆ తర్వాత సహజీవనం చేస్తున్నారని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.
వీరి మధ్య ఎప్పటినుండో లవ్ నడుస్తూనే ఉంది.కానీ ఈ విషయాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.ఎప్పుడైతే నరేష్ మూడో భార్య రమ్య వచ్చి వీళ్ల గురించి పెద్ద రాద్ధాంతం చేసిందో ఇక అప్పటినుంచి వీరి గురించి షాకింగ్ నిజాలు బయటపడుతూనే ఉన్నాయి.
దీంతో వీరు చేసిన పనిని చూసి వీరిని జనాలు బాగా ఏకీపరిస్తున్నారు.
ఇటీవలె సూపర్ స్టార్ కృష్ణ మరణించినప్పుడు కూడా వీళ్ళ రొమాన్స్ మాత్రం బాగానే నడిచింది.
ఇంక ఆ సమయంలో కూడా కెమెరా వాళ్లు వీరినే టార్గెట్ చేశారు.దీంతో వీరిపై మరిన్ని నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ వస్తున్నాయి.
ఇక తమపై వస్తున్న ట్రోల్స్ గురించి తాజాగా పవిత్ర లోకేష్ రమ్య పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రమ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుంది అని.ఇదివరకే రమ్య, నరేష్ ల మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయంటూ.ఆమె కూడా పలు క్రిమినల్ కేసులో జోక్యం చేసుకుంది అని తెలిపింది.
ఇక తన పరువుకు భంగం కలిగేలా రమ్య ప్రవర్తిస్తుంది అని పలు యూట్యూబ్ ఛానల్ వెనుక ఆమె చేయి ఉందని తెలిపింది.
ఇక గతంలో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అని.ఇక ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతర పోస్టులు చేయిస్తున్న యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది.ప్రస్తుతం ఈమె పోలీసులను ఆశ్రయించటంతో ఈ వార్త టాలీవుడ్ లో మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఇక నెటిజన్స్ మాత్రం ఇదేం గోలా రా బాబోయ్ అంటూ తెగ విమర్శలు చేస్తున్నారు.