చనిపోయిన లవర్ ను తలచుకుంటూ ఏడ్చిన పండు.. ఏం జరిగిందంటే?

డ్యాన్సర్ పండు గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఢీ షో ద్వారా పండు ప్రేక్షకులకు దగ్గర కావడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

 Pandu Emotional In Sridevi Drama Company Show Details, Pandu, Sri Devi Drama Com-TeluguStop.com

ఇతర ఛానెళ్లలోని ప్రోగ్రామ్స్ లో కూడా పండు సందడి చేసినా ఈటీవీ ఛానల్ లోని ప్రోగ్రామ్స్ కు పండు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో పండు చనిపోయిన లవర్ ను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు మంచి రేటింగ్స్ వస్తుండగా పండు మాట్లాడుతూ ఊహ తెలియని సమయంలో మా అమ్మ చనిపోయిందని ఆ తర్వాత అంతగా ఈ అమ్మాయిని ప్రేమించానని తెలిపారు.అమ్మలా ఉంటానని ఆ అమ్మాయి ప్రామిస్ చేసిందని తల్లి, తల్లి అని ఆ అమ్మాయిని నేను పిలిచేవాడినని పండు చెప్పుకొచ్చారు.

కానీ నేను ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను వదిలేసి నా తల్లి దగ్గరికే వెళ్లిపోయిందని పండు అన్నారు.

నా కంటే ఆ అమ్మాయి బాగా చూసుకుంటుందని నా తల్లి ఆ అమ్మాయిని తీసుకెళ్లిందేమో అంటూ పండు కామెంట్లు చేశారు.

పండు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అక్టోబర్ నెల 2వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం.మంగమ్మ గారి కొడుకు పేరుతో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

హేమ, అమ్మ రాజశేఖర్ ఈ షోకు గెస్ట్ లుగా హాజరు కాగా హైపర్ ఆది పంచ్ లు ప్రోమోకు హైలెట్ గా నిలిచాయి.పండు లవ్ స్టోరీ విని షోలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే పండు నవ్వుల వెనుక ఇంత విషాదం ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube