రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికారులందరూ సమన్వయం తో పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాను అభివృద్ధి పధం లో అగ్రగామి గా నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం రోజున జిల్లా కలెక్టర్ చాంబర్ లో ( డోర్స్ ) డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (జిల్లా అధికారుల సంఘం) రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో నిర్వహించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్,డైరీ లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ ,
అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పి గౌతమి ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డోర్స్ జిల్లా కార్యదర్శి డా.వినోద్ కుమార్, ట్రెజరర్ పి.బి.శ్రీనివాసాచారి, వైస్ ప్రెసిడెంట్ లు జి.శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డా.కే.కొమురయ్య,పబ్లిసిటీ సెక్రటరీ మోహన్ రెడ్డి , ఈ.సి.మెంబర్లు ఎన్.రాఘవేందర్, పి.లక్ష్మి రాజం, మల్లికార్జున్ రావు , డి.పి.అర్.ఓ .వి.శ్రీధర్ , డి.పి.ఓ.వీర బుచ్చయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ ఓ .ఎస్.డి.సర్వర్ మియా, తదితరులు పాల్గొన్నారు.