పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది ప్రభాస్ నుండి వచ్చిన రాధేశ్యామ్ నిరాశ పరచడంతో ఫ్యాన్స్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తుంటే ఈ సినిమా అంతా ఆలస్యం అవుతూ ఉంది.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు.
ఈ భారీ ప్రాజెక్టులో చాలా మంది నటీనటులు భాగం అయ్యారు.లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.
లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.
ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్ డైరెక్ట్ సినిమాతో అడుగు పెట్టబోతున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.ఈ సినిమా వాయిదా పడింది అని తెగ వైరల్ న్యూస్ లు వస్తున్నాయి.
అయితే ఇది నిజం కాదు.కాకూడదు అని ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు.
కానీ ఇదే నిజం చేస్తూ తాజాగా ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేసేసారు.ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.
ఈయన పోస్ట్ చేస్తూ.ప్రేక్షకులకు పూర్తిగా అద్భుతమైన విజువల్ అనుభూతి ఇవ్వడం కోసం మాకు మరింత సమయం కావాలి.
ఇండియా గర్వించదగ్గ సినిమా కోసం మేము కృషి చేస్తున్నాం.మీ మద్దతు, ప్రేమ, ఆశీస్సులు మమ్మల్ని నడిపిస్తున్నాయి.
అంటూ తెలిపాడు.ఇక ఈ సినిమాను జూన్ 16, 2023 కి వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిరాశ చెందుతున్నారు.