గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతే కన్పిస్తోందన్నారు.
బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని రాజాసింగ్ ధ్వజమెత్తారు.
డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న చోట డబుల్ డెవలప్ మెంట్ అవుతుందని తెలిపారు.ఈ క్రమంలో బీజేపీకి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ చేసి చూపిస్తామని రాజాసింగ్ వెల్లడించారు.
బండి సంజయ్ ను ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలు గెలిపించాలని కోరారు.
.