2021 సెప్టెంబర్ లో సాయి ధరమ్( Sai Dharam tej ) తేజ్ అతి పెద్ద ప్రమాదానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరం తేజ్ నెల రోజుల పాటు ఆసుపత్రికే పరిమితమయ్యాడు చాలా రోజుల పాటు కోమాలో ఉండి ఆ తర్వాత కోలుకొని ఇటీవల విరూపాక్ష( Virupaksha) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం ఘన విజయం సాధించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ తనను కాపాడిన వ్యక్తి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సాయిధరమ్ తేజ్ నీ ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి పేరు సయ్యిద్ అబ్దుల్.
అతడు హైదరాబాద్లో గల సిఎంఆర్ షాపింగ్ మాల్( CMR Shopping Mall) లో బ్రతుకుతెరువు కోసం ఉద్యోగం చేస్తూ ఉంటాడు.
అయితే సాయి ధరమ్ తేజ్ సయ్యద్ గురించి మాట్లాడుతూ నన్ను కాపాడిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోలేను.అతడిని కలిసి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఎప్పుడు ఇలాంటి సహాయం కావాల్సి వచ్చినా మొహమాటం లేకుండా ఫోన్ చేయమని చెప్పాను అంటూ తెలిపాడు.దాంతో ప్రస్తుతం సాయి ధరంతేజ్ తను కాపాడుకునే వ్యక్తికి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినట్టుగా సోషల్ మీడియాతో పాటు శ్రీ మీడియా కూడా కొన్ని వార్త కథనాలను ప్రసారం చేసింది.
కానీ అసలు విషయం ఎందుకు భిన్నంగా ఉంది.సయ్యద్ అబ్దుల్)(Syed Abdul) ని మెగా ఫ్యామిలీ తో పాటు సాయి ధరంతేజ్ తో పాటు ఎవ్వరు కూడా కలవలేదని అతని ఫోన్ నెంబర్ కూడా తన దగ్గర లేదు అని చెప్తున్నాడు సయ్యద్.
లక్షల రూపాయలు ఇచ్చారంటూ వార్తలు రావడంతో తను పని చేసే చోట అందరూ వేధింపులకు గురి చేశారని జాక్ పాట్ కొట్టేసావు అంటూ తరచూ వేధించడంతో ఉద్యోగం మానేశానని, చుట్టాలు కూడా ఫోన్ చేసి ఎన్ని లక్షలు ఇచ్చారు అంటూ టార్చర్ పెట్టడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యానంటూ చెబుతున్నాడు సయ్యద్.ఇక్కడ డబ్బులు ఇచ్చాడా లేదో సంగతి పక్కన పెడితే సాయి ధరంతేజ్ కి డబ్బులకు ఏమాత్రం చదవండి చెప్పండి అతడు తలుచుకుంటే కోట్ల రూపాయలను సైతం ఇవ్వగలడు.మరి అంత పెద్ద సహాయం చేసి తన ప్రాణాలను కాపాడిన సయ్యద్ కి సాయి ధరంతేజ్ రూపాయి కూడా ఇవ్వకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందో అని అందరూ మాట్లాడుకుంటున్నారు.