విరాట పర్వం కోసం మరో హీరోయిన్‌

రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్‌ గా ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతున్న విరాట పర్వం సినిమాలో మరో హీరోయిన్‌ గా నివేదా థామస్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

 Nivetha Pethuraj In Virata Parvam Movie, Virata Parvam Movie, Nivetha Pethuraj,-TeluguStop.com

ఈ సినిమాలో నటించబోతున్నది నివేదా థామస్ కాదని నివేథా పేతురాజ్‌ అంటూ పేర్కొన్నారు.రంగస్థలం సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం ఈమెకు సంబంధించిన సినిమాలు పలు సెట్‌ పై ఉన్నాయి.వచ్చే ఏడాది ఈమె నటిస్తున్న అయిదు ఆరు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Telugu Naxals, Nivethapethuraj, Priyamani, Rana, Rana Dggubati, Sai Pallavi, Tel

ఈ సమయంలోనే రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా ఈమెకు అవకాశం వచ్చింది.రెండేళ్లుగా ఈ సినిమా చర్చలు జరుగుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని ఒక ముఖ్య పాత్రకు గాను నివేథా పేతురాజ్‌ ను దర్శకుడు వేణు ఉడుగుల ఎంపిక చేశాడు.ఇటీవలే షూటింగ్‌ పునః ప్రారంభం అయిన ఈ సినిమాలో రానా మరియు సాయి పల్లవిలు పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్‌ ను వచ్చే నెల చివరి వరకు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.వచ్చే సమ్మర్‌ లో విడుదల చేసేందుకు గాను చిత్ర యూనిట్‌ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే విషయం తెల్సిందే.ప్రియ మణి నక్సలైట్‌ గా కనిపించబోతుందట.

ఈ సినిమాలో రానా పోలీస్‌ ఆఫీసర్‌ గా మరియు నక్సలైట్‌ గా కూడా కనిపించబోతున్నట్లుగా మేకర్స్‌ చేబుతున్నారు.సాయి పల్లవి లుక్‌ కు ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube