యూత్ స్టార్ అనే బ్రాండ్ ని సొంతం చేసుకొని హీరోగా దూసుకుపోతున్న నటుడు నితిన్.హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకుంటూ అటు కమర్షియల్, ఇటు కొత్తదనం ఉన్న కథలకి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు.
ఈ ఏడాదిలో నితిన్ నటించిన చెక్, రంగ్ దే మూవీలు ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్ళిపోయాయి.అయినా కూడా గ్యాప్ లేకుండా వరుసగా నాలుగు సినిమాల వరకు లైన్ లో పెట్టాడు.
ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మ్యాస్ట్రో మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
హిందీ అందాధున్ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.నభా నటేష్ నితిన్ కి జోడీగా ఈ మూవీలో నటిస్తూ ఉండగా, తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది.
ఇదిలా ఉంటే దీని తర్వాత వక్కంతం వంశీ, కృష్ణచైతన్య పవర్ పేట సినిమాలు నితిన్ లిస్టులో ఉన్నాయి.ఇప్పుడు మరో వ్యక్తికి దర్శకుడుగా అవకాశం ఇచ్చినట్లు టాక్.పూరి జగన్నాథ్ సినిమాలకి ఎక్కువగా ఎడిటర్ గా పనిచేసిన ఎస్.ఆర్.శేఖర్ ని దర్శకుడిగా నితిన్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం ఇతను మ్యాస్ట్రో మూవీకి ఎడిటర్ గా పని చేస్తున్నాడు.
ఈ సందర్భంగా నితిన్ కి ఓ కథని శేఖర్ నేరేట్ చేసాడని, అది నచ్చడంతో వెంటనే ఒకే చేసాడని సమాచారం.త్వరలో దీనికి సంబందించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరి శేఖర్ దర్శకత్వంలో మూవీని నితిన్ వెంటనే స్టార్ట్ చేస్తాడా లేదంటే ప్రస్తుతం ఉన్న మిగతా కమిట్ మెంట్ లు పూర్తి చేసిన తర్వాత అతని సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది.