డైరెక్టర్ చందు మొండిటి దర్శకత్వంలో హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 సినిమాని తెరకెక్కించారు.
ఇక ఇందులో కలర్స్ స్వాతికి బదులు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల అయ్యి ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది.
ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టడంతో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నటువంటి ఈ సినిమా తాజాగా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకుండా యూఎస్ఏ లో కూడా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ క్రమంలోనే అమెరికాలో ఈ సినిమా ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల వసూలు రాబట్టింది.

ఇది మాత్రమే కాకుండా అమెరికాలో విడుదలై నాలుగవ వారంలో కూడా ఏకంగా 80 కి పైగా లొకేషన్లలో ప్రదర్శితమైన మొట్టమొదటి తెలుగు సినిమాగా కార్తికేయ సినిమా రికార్డు సొంతం చేసుకుంది.ఇలా అమెరికాలో ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారిక ఖాతా ద్వారా తెలియజేశారు.ఇలా ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.








