ఒకప్పుడు తన సినిమాలతో క్రియేటివ్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ( Ramgopal Verma )ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు .సెన్సేషన్ క్రియేట్ చేసే ఏ అంశం పైన అయినా తన మార్కు సినిమా ఒకటి తీసి వదులుతూ ఉంటాడు .
విజయలక్ష్మి ( Vijayalakshmi )ఆయన వదిలి చాలా కాలమైనా జనాల అటెన్షన్ తన వైపు తిప్పుకోవడంలో మాత్రం ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు అందుకే ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా తన కొత్త ప్రాజెక్టుకి పట్ల ఆసక్తి వచ్చేలా ఆయన కాంట్రవర్సీలు వాడుకుంటాడని విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఒక కొత్త అవతారం ఎత్తాడు .

రాష్ట్రం లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వివేకానంద రెడ్డి హత్య కేసు( Vivekananda Reddy murder case ) నేపద్యం లో ఒక కొత్త ప్రాజెక్టు చేశాడట “నిజo”( nijam ) అనే ఒక చానెల్ ను పెడుతున్నటు ప్రకటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన వర్మ దాని కార్యాచరణ కూడా ప్రకటించాడు నిజమనే ఒక ఛానల్ పెట్టి అబద్ధం యొక్క బట్టలూడదీసి, నగ్న సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారట .
కేవలం పొలిటికల్ కాంట్రవర్సీలే కాకుండా హిస్టరీ, సైన్స్ ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ,క్రైమ్, ఇలా అన్ని అంశాలపై ఆయా రంగాలలో నిపుణులతో కలిపి ప్రోగ్రాములు చేస్తామని .సమాజానికి అవసరమైన కంటెంట్ను ప్రసారం చేస్తామంటూ ఆయన ప్రకటించారు .నిజం ఛానల్ కు నాంది ప్రస్తావనగా వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగిన అసలు నిజాన్ని వెలికి తీస్తామని ఈ వ్యవహారాన్ని మొదటి ఎపిసోడ్ గా ప్రసారం చేయబోతున్నామని

ఆయన ప్రకటించి ఆసక్తి ని కలగ చేశారు ఆయన పూర్తిస్థాయిలో అధికార వైసిపి పార్టీకి( YCP party ) తొత్తు గా మారిపోయాడని ఆ పార్టీ అనుకూలంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ వారి పరువు తీసేలా సినిమాలు తీస్తున్నాడని అందువల్ల ఆయన చెప్పే నిజాల్లో నిజాలు ఉండే అవకాశం చాలా తక్కువ ఉందంటూ సోషల్ మీడియా వేదికగా అనేకమంది విమర్శలు చేస్తున్నారు నిజంగా నిజాన్ని చూపిస్తారో లేదో రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు వేచి చూడాల్సి ఉంటుంది.