మొదలైన నిహారిక నిశ్చితార్థ ఏర్పాట్లు, వారికి ఆహ్వానం లేదట

మెగా వారి ఇంట పెళ్లి సందడికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

చాలా రోజుల తర్వాత మెగా వారి ఇంట పెళ్లి కనుక ఏర్పాట్లు భారీగా ఉండి అతిరథ మహారథులు వస్తారనుకుంటే కరోనా కారణంగా ఆంక్షల మద్య ఆ వేడుక నిర్వహించబోతున్నారు.

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహ నిశ్చితార్థం వచ్చే నెల 13వ తారీకున నిర్వహించబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కాని ఆంక్షల మద్య ఆ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య అత్యంత ప్రమాదకరంగా ఉంది.దాంతో నిశ్చితార్థంకు బయటకు వారిని ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పిలిచేందుకు సిద్దంగా లేరు.

మెగా కాంపౌండ్‌ వరకే ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొనబోతున్నారు.అందుకు సంబంధించిన వెన్యూ ను ఫైనల్‌ చేసే పనుల్లో ఉన్నారు.

Advertisement

అమ్మాయి అబ్బాయి వైపు నుండి కలిపి మొత్తంగా వంద మంది లోపే ఉండాలని భావిస్తున్నారు.

పెళ్లి వచ్చే ఏడాది కనుక అప్పటి వరకు కరోనా కనబడకుండా పోతే అప్పుడు భారీగా పెళ్లి చేయాలని భావిస్తున్నారు.ఈసారికి మాత్రం సినీ ప్రముఖులు ఎవరికి కూడా ఆహ్వానం అందలేదు.ఇండస్ట్రీలో ముఖ్యులు అయిన వారు కూడా ఈ వివాహ నిశ్చితార్థంకు హాజరు అవ్వడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

నిహారిక, చైతన్యల జంట ఇప్పటికే సోషల్‌ మీడియాలో సెన్షేషనల్‌ అయ్యింది.అందుకే వారిద్దరు మళ్లీ ఎప్పుడు మీడియా ముందుకు వస్తారా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు