1.
టీడీపీ లో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు.
2.
రేవంత్ ఖబడ్దార్ : రేగ
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ప్రభుత్వ విప్ రేగ కాంతారావు సంచలన విమర్శలు చేశారు.పాదయాత్రలో రేవంత్ తనపై చేసిన విమర్శలకు స్పందించిన రేగ.రేవంత్ రెడ్డి ఖబడ్దార్.రేగ తో పెట్టుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
3.
టిడిపి నేతల హౌస్ అరెస్ట్
గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం ఘటన తరువాత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఈ రోజు టీడీపీ కీలక నేతలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
4.
వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి విచారణకు బ్రేక్ పడింది.వ్యక్తిగత పనుల కారణంగా తాను అందుబాటులో ఉండనని ముందుగానే చెప్పడంతో విచారణ వాయిదా పడింది.
5.
కెసిఆర్ దొర కాదు దొంగ : కేఏ పాల్
తెలంగాణ సీఎం కేసీఆర్ దొరకాదు దొంగ అని, తాను శపిస్తే నరకానికి వెళతారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు.
6.ములుగు డి సీ సీ అధ్యక్షుడి మృతి
ములుగు డిసిసి అధ్యక్షుడు కుమారస్వామి అనారోగ్యంతో మృతి చెందారు.ఆయన మృతికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
7.
బళ్లారి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపి ఉంచిన బళ్ళారి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు వచ్చింది.ఒక గుర్తు తెలియని వ్యక్తి బళ్లారి ఎక్స్ప్రెస్ కు బాంబు పెట్టినట్లుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైల్వే పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టగా, బాంబు లేదని తేలింది.ఎవరో ఆకతాయి చేసిన ఫోన్ కాల్ గా గుర్తించారు.అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
8.
తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ ఉందా : షర్మిల
తెలంగాణలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా ? ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
9.
పోలవరం ప్రాజెక్టు వల్లే ముంపు
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్లే భద్రాచలం కు గతేడాది ముంపు ఏర్పడిందని ఉన్నత స్థాయి కమిటీ తేల్చింది.ఈ నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందించింది.
10.
తాలిబన్లతో ఆదానికి సంబంధాలు : నారాయణ
తాలిబన్లతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానికి సంబంధాలు ఉన్నాయని సిపిఐ నేత నారాయణ సంచలన విమర్శలు చేశారు.
11.
ఛత్తీస్ గడ్ గవర్నర్ గా బిస్వభూషన్ హరిచందన్
ఛత్తీస్ గడ్ తొమ్మిదో గవర్నర్ గా బిస్వభూషన్ హరిచందన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
12 .
కంటి పరీక్షలు చేయించుకున్న హరీశ్ రావు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట లో కంటి పరీక్షలు చేయించుకున్నారు.
13 .
ఏపీ లో బీ ఆర్ ఎస్ న్యూస్ పేపర్
ఏపీలో బీఆర్ ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా కొత్త న్యూస్ పేపర్ ను ప్రారంభించే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు.
14 .
కుక్కల దాడిలో బాలుడి మృతి .హై కోర్ట్ విచారణ
హైదరాబాద్ లోని అంబర్ పేట లో సంచలనం రేపిన కుక్కల దాడిలో బాలుడి మృతి వ్యవహారం పై హై కోర్టు విచారణ చేపట్టింది.
15 .
వీధి కుక్కల సమస్యపై తలసాని సమీక్ష
వీధి కుక్కలు, కోతుల సమస్య పై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
16 .
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ
17 .
లిక్కర్ స్కాం పై కోర్టులో విచారణ
నేడు లిక్కర్ స్కాం పై కోర్టులో విచారణ జరిగింది.ఈడి చార్జిషీట్ పై కోర్టు విచారించింది.
18
చంద్రబాబు పై కొడాలి నాని కామెంట్స్
పట్టాభి చుట్టూ రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
19
.ఏపీ కొత్త గవర్నర్ బాద్యతలు స్వీకరణ
ఏపీ కొత్త గవర్నర్ గా సుప్రీం కోర్ట్ విశ్రాంత నయమూర్తి అబుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేసారు.ఆయన్ను ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
20.
ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,800
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 56 ,510
.