ఈశాన్య రాష్ట్రం మణిపూర్ కు కొత్త డీజీపీ నియామకం అయ్యారని తెలుస్తోంది.ఇటీవల మణిపూర్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న డీజీపీ డౌంగెల్ ను బదిలీ చేసింది.ఆ స్థానంలో 1993 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ సింగ్ ను డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇటీవల అక్కడ పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా భవిష్యత్ లో ఇలాంటి హింస జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.