టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొంది ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
అంతే కాకుండా ఎంతో మంది అభిమానులు కూడా సంపాదించుకున్నాడు.వ్యక్తిగతంగా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ బాలనటుడుగా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత చిరంజీవి నటించిన డాడీ సినిమాలో అతిధి పాత్రలో నటించాడు.ఇక 2003లో గంగోత్రి సినిమాతో తొలిసారిగా హీరోగా పరిచయం అయ్యాడు.ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు.
అలా ఆ తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు వంటి పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ఇక మరికొన్ని సినిమాలు తనను బాగా నిరాశపరిచాయి కూడా.
అయినా కూడా సహనాన్ని కోల్పోకుండా ధైర్యంతో ముందుకు కొనసాగాడు.ఇక ఇటీవలే పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు అల్లు అర్జున్.
సుకుమార్ దర్శకత్వంలో ఇటీవలే తెరకెక్కిన పుష్ప సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా ఈ సినిమా విడుదల కావడంతో అక్కడ కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.ఇక అల్లు అర్జున్ పారితోషికం విషయంలో కూడా బాగానే ముందున్నాడు.
ఇక ఈయన ఫ్యామిలీ పర్సనల్ కూడా.
ఈయన భార్య స్నేహ రెడ్డి అందరికీ పరిచయమే.ఈయనకు ఇద్దరు పిల్లలు ఉండగా తన కూతురిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.చాలా వరకు తన పిల్లలకు సంబంధించిన వీడియోలను, అల్లు అర్జున్ కు సంబంధించిన అప్డేట్లను బాగా పంచుకుంటూ ఉంటుంది.
ఇక అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా తక్కువ సమయాన్ని గడుపుతాడు.ఇక అల్లు అర్జున్ కేవలం వెండితెర పైన కాకుండా బుల్లితెరపై కూడా పలు ప్రకటనలు చేశాడు.అంతే కాకుండా కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేశాడు.ఇదంతా పక్కన పెడితే తాజాగా రెడ్ బస్ గురించి ఒక యాడ్ చేయగా దానిని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
ఇక ఆ వీడియో చూసిన ఆయన అభిమానులు.మీరు ఏం చెప్పారో అర్థం కాలేదు కానీ మీరు మాత్రం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది.ఒక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ ఒక్క సినిమాతోనే బిజీగా ఉన్నట్లు మరే ప్రాజెక్టులకు ఇప్పటంతలా ఎటువంటి సైన్ చేయలేదు అని తెలుస్తుంది.