సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సాయి పల్లవి గురించి అందరికీ సుపరిచితమే.ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలామంది తప్పనిసరిగా స్కిన్ షో చేయాలని చెబుతున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఎక్కువగా అందాలను ఆరబోస్తూ సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులను సైతం రోజురోజుకు పెంచుకుంటూ పోతూ ఉంటారు.అయితే సాయి పల్లవి ఇందుకు భిన్నం అని చెప్పాలి.
ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి నప్పటి నుంచి ఎలాంటి గ్లామర్ షో చేయకుండా ఎంతో నిండుగా దుస్తులు ధరించి, అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
ఒకానొక సమయంలో సౌందర్య వంటి హీరోయిన్ లాగా ఈమె కూడా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా ఎన్నో సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఉన్నారు.
ఈ క్రమంలోనే నెటిజనులు ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ సాయి పల్లవి వల్ల మిగిలిన హీరోయిన్లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఇప్పటికే ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి సమంత, రకుల్, పూజ, రష్మిక వంటి హీరోయిన్లందరూ కూడా టూ పీస్ డ్రెస్సులను ధరించి భారీ ఎక్స్పోజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ విధంగా ఎక్స్ పోస్ట్ చేస్తూ సినిమా అవకాశాలను అందుకున్న వీరిని సాయి పల్లవితో పోలుస్తూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
ఏ విధమైనటువంటి ఎక్స్ పోజ్ లేకుండా యూత్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ సాయి పల్లవి అంటూ పెద్ద ఎత్తున సాయి పల్లవి పై ప్రశంసలు కురిపిస్తూ…మిగతా హీరోయిన్లను ట్రోల్ చేస్తున్నారు.ఇకపోతే సాయిపల్లవి సినిమాల విషయానికి వస్తే తాజాగా విరాటపర్వం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.రానా సరసన నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కానుంది.