భారత్ విమానాల‌పై నిషేధం ఎత్తివేసిన నెద‌ర్లాండ్ ప్రభుత్వం.. కానీ.. ?

కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో తీవ్ర రూపం దాల్చిన నేపధ్యంలో మన దేశం నుండి వెళ్లే విమానాలను కొన్ని దేశాలు నిషేదించిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఇండియాలో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో అయా దేశాలు తమ ఆంక్షలను సడలించుకుంటున్నాయి.

ఈ క్రమంలో భారత్ నుండి వచ్చే ప్రయాణికులకు కొన్ని ఆంక్షలు విధిస్తూ అనుమతులు ఇస్తున్నాయి.ఈ క్రమంలో జూన్ 1 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా, మధ్య దక్షిణ అమెరికా విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తు నెద‌ర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ దేశ అధికారులు వెల్లడించారు.

Netherlands Govt Lifts Ban On Passenger Flights From India, Netherlands Govt, Li

కానీ ఒక కండీషన్ పెట్టారు.అదేమంటే ప్రయాణానికి ముందు చేయించుకున్న కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపిస్తేనే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని ప్రకటించారు.

ఇదే కాకుండా నెదర్లాండ్ వచ్చిన ప్రయణికులు క్వారంటైన్ నిబంధనలను తప్పక పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు