అబద్ధాలు చెప్పకూడదు అంటున్న నయనతార

ఇద్దరితో ప్రేమలో పడి మోసపోయిన నయనతారకు మంచి పాఠాలే దొరికినట్టున్నాయి.కాబోయే భర్త ఎలా ఉండాలో తనవరకు బాగా తెలుసు అంటా.

అలాగే భార్య భర్తలు ఎలా ఉండాలో కూడా చెప్పేస్తోంది.మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఏమి దాచుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అని వేదాంతం వల్లిస్తోంది నయనతార.

‘‘భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి అపారమైన నమ్మకం ఉండాలి .ఆలుమగల మధ్య దాపరికాలు అస్సలు ఉండకూడదు.ఏదైనా విషయాన్ని దాయడానికి అబద్ధం చెప్పడం మొదలుపెడితే, దాన్ని కప్పిపుచ్చడానికి, ఆ అబద్ధానికి కొనసాగింపుగా మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది.

అది మనస్పర్థలకు దారి తీస్తుంది.అందుకే భార్యాభర్తలు వీలైనంతవరకూ పారదర్శకంగా ఉండాలి.నిజాయతీ లేని బంధం కొనసాగదని నా నమ్మకం.

Advertisement

అలాగే, రాజీపడని బంధం కుడా ఎంతోకాలం నిలవదు.పట్టువిడుపులు ఉండాలి.

అలాగని ప్రతి విషయానికి రాజీపడాలని అనను.ఎక్కడ రాజీపడాలో అక్కడ మాత్రం ఇద్దరు పడాల్సిందే.

భార్యాభర్తలు స్నేహితుల్లా ఉండాలి.ఒకవేళ భర్త కనుక మంచి స్నేహితుడిగా ఉంటే భార్యకు అంతకన్నా కావల్సింది ఏమీ ఉండదు.

నేను అలాంటివాడినే చేసుకుంటా’’ అంటూ వివాహ బంధాలు ఎలా ఉండాలో చెప్పింది నయన.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
Advertisement

తాజా వార్తలు