స్టార్ హీరోయిన్ నయనతార స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ల పెళ్లి ఈ నెల 9వ తేదీన గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.మహా బలేశ్వరంలో గ్రాండ్ గా నయన్ విఘ్నేష్ ల వివాహం జరగగా పెళ్లి తర్వాత నయన్ విఘ్నేష్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అయితే నయనతార సినీ కెరీర్ కు సంబంధించి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.
పెళ్లి తర్వాత భర్తకు ఎక్కువ సమయం కేటాయించాలని నయనతార భావిస్తున్నారని బోగట్టా.
అందువల్ల నయనతార కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో సైతం రొమాంటిక్ సన్నివేశాలలో నటించకూడదని నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
వైరల్ అవుతున్న వార్త విని నయనతార అభిమానులు షాకవుతున్నారు.
మరోవైపు పెళ్లి కావడంతో నయనతారకు సినిమా ఆఫర్లు తగ్గే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ప్రస్తుతం నయనతార షారుఖ్ ఖాన్ కు జోడీగా జవాన్ అనే మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే నయనతార పెళ్లి తర్వాత ఆనందంగా జీవితం గడపాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగులో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నయనతార నటిస్తున్నారు.సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత నయనతార తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.గాడ్ ఫాదర్ సినిమాతో నయనతార మరో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.కథ, కథనం కంటే నయనతార రెమ్యునరేషన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నయనతార పెళ్లి తర్వాత సినిమాల విషయంలో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందని సమాచారం.