ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో పాగా వేసేటందుకు బాగానే ్రపయత్నిస్తోంది.పార్టీకి కార్యకర్తలు ఉన్నది తక్కవే అయినా, అంతా క్రమశిక్షణగా పనిచేస్తే అధికారం అందుకోవచ్చని భావించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఫక్తు రాజకీయ పార్టీ నేతలా వ్యవహరిస్తున్నారిప్పుడు.
ఈ క్రమంలోనే అకాలీ, బిజేపిల బంధంపై ప్రభావం చూపేలా గత కొంత కాలంగా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూని దువ్వుతూ వస్తున్న ఆయన ఎట్టకేలకు విజయం సాధించారు.అధికార పార్టీలో ఉండి పనులు చేయించుకోవాలనుకున్నా, సొంత పార్టీ నేతలు అకాలీలకే ప్రాధాన్యత ఇవ్వటంతో కొంత కాలంగా సిద్దూ బిజేపీకి దూరంగానే ఉంటున్నారు.
అయితే పార్టీ వీడతారని భావించని బిజేపీ పెద్దలు పట్టనట్టుగానే వ్యవహరించడంతో సోమవారం ఆయన హఠాత్తుగా తన ఎంపి పదవికి, భాజపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.ఇది ఆశ్చర్యకరమైన విషయమే అయినా .సిద్ధూ, ఆయన భార్య కూడా పంజాబ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారే అయినా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పార్టీ వీడారనిపిస్తోందని బిజేపీ భావిస్తోంది.మరి రెండు మూడు రోజులలో సిద్దూ తన పరివారంతో ఆప్లో చేరటమే తరువాయిలా కనిపిస్తోంది.
సిఎంగా సిద్దూ….ఇప్పటికే పంజాబ్లో వివిధ కార్యక్రమాలతో దూసుకు పోతున్న ఆయన సిక్కు ఓట్లను భారీగా కొల్లగొట్టాలని భావిస్తున్నారు.
దీంతో పార్టీలోనికి రానున్న సిద్దును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించనున్నారని సమాచారం
.