జాతిరత్నాలు సీక్వెల్‌ పై హీరో అభిప్రాయం.. ఫ్యాన్స్‌కి నిరాశ

నవీన్‌ పొలిశెట్టి.జాతి రత్నాలు సినిమా విడుదలకు ముందు వరకు కొద్ది మందికి మాత్రమే ఈ పేరు.

ఆ హీరో తెలుసు.కాని ఇప్పుడు ఆయన ఒక టాలీవుడ్‌ స్టార్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మూడు నాలుగు సినిమాలు ఆయన చేస్తున్నాడు.నటుడిగానే కాకుండా స్క్రిప్ట్‌ రైటర్ గా మరియు ఒక మంచి స్టోరీ టెల్లర్ గా కూడా పేరు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి నుండి ఎప్పుడెప్పుడు జాతిరత్నాలు 2 సినిమా వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన జాతిరత్నాలు సినిమా కు సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా దర్శకుడు అనుదీప్ స్వయంగా ప్రకటించాడు.కాని కథను రెడీ చేసి హీరో మరియు చిత్ర నిర్మాతకు.

Advertisement

హీరోయిన్ కు వినిపించి ఒప్పించడం అనేది పెద్ద టాస్క్‌ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.జాతిరత్నాలు సినిమా ను చేయాలంటే మొదట నవీన్‌ పొలిశెట్టి నుండి కథకు ఓకే అనే సమాధానం రావాలి.

అది చాలా పెద్ద విషయం అన్నట్లుగా అనుదీప్ ఇటీవల చెప్పుకొచ్చాడు.నవీన్ కూడా జాతిరత్నాలు సినిమాకు సీక్వెల్‌ పై ఆసక్తిగా ఉన్నాడు.

కాని ఆయన కథ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడు.జాతిరత్నాలకు వచ్చిన మంచి పేరును చెడగొట్టకుండా ఆ పేరును మరింతగా పెంచే విధంగా స్క్రిప్ట్‌ ఉంటేనే తాను నటిస్తాను అన్నట్లుగా ఇప్పటికే అనుదీప్ కు చెప్పాడట.

ఆ విషయంలో అనుదీప్‌ చాలా పట్టుదలతో కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కాని నవీన్‌ పొలిశెట్టి ఆయన రెడీ చేస్తున్న కథలకు ఓకే చెప్పడం చాలా కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమా కు సీక్వెల్‌ అంటే కాస్త భయపడుతున్నాడు.ఆ సినిమా పై ఉన్న అభిమానం గౌరవం ఎక్కడ దెబ్బ తింటుందో అంటూ ఆయన ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఫ్యాన్స్ ఈ విషయం లో నవీన్‌ పొలిశెట్టి నిర్ణయం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు కాకున్నా రెండేళ్ల తర్వాత అయినా మళ్లీ జాతిరత్నాలు వస్తారనుకుంటే ఇలా చేస్తున్నారేంటీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజా వార్తలు