ఆ షో తర్వాత అందరూ మంచిగా చూస్తున్నారు : నవదీప్

జై సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన నవదీప్ హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోసగాళ్లు సినిమాలో నవదీప్ కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవదీప్ మాట్లాడుతూ బిగ్ బాస్ షో వల్ల తనకు మంచే జరిగిందని అన్నారు.మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు ఎంతో ఇష్టమని నవదీప్ అన్నారు.

ఎన్సీసీలో అమ్మకు చిరంజీవి సీనియర్ అని.ఆ సమయంలో చిరంజీవితో కలిసి అమ్మ ఫోటో దిగారని నవదీప్ తెలిపారు.అమ్మ చాలాసార్లు మెగాస్టార్ తో కలిసి దిగిన ఫోటోను చూపించిందని అలా ఫోటోను చూడటం వల్ల చిరంజీవిపై తెలియకుండానే అభిమానం ఏర్పడిందని వెల్లడించారు.

సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత అల్లు అర్జున్, అల్లు శిరీష్ తో పరిచయం ఏర్పడిందని నవదీప్ తెలిపారు.

Advertisement

మొదట్లో బన్నీ, శిరీష్, తాను కలిసి పార్టీలు చేసుకునే వాళ్లమని ఆ తరువాత చరణ్, రానాలతో కూడా స్నేహం ఏర్పడిందని నవదీప్ అన్నారు.చాలామంది తనను మెగా కాంపౌండ్ హీరో అని భావిస్తారని వెల్లడించారు.తాను మొదట్లో చిన్నచిన్న తప్పులు చేశానని.

ఆ తప్పుల వల్ల తరువాత కాలంలో మంచి చేసినా చెడుగా రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయని నవదీప్ వెల్లడించారు.తన దగ్గర ఉండేవాళ్లకు తన గురించి పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్లు తన గురించి తప్పుగా అనుకునే వాళ్లు కాదని అన్నారు.

అదే సమయంలో బిగ్ బాస్ షోలో తనకు ఛాన్స్ వచ్చిందని ఆ షో ద్వారా తనపై ప్రేక్షకుల్లో అభిప్రాయం మారిపోయిందని.అందరూ తనను మంచిగానే చూస్తున్నారని నవదీప్ పేర్కొన్నారు.

నవదీప్ కీలక పాత్రలో నటించిన మోసగాళ్లు సినిమా రేపు విడుదల కానుంది.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా
Advertisement

తాజా వార్తలు