ప్రస్తుతం నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం తీవ్ర వివాదాలకు కారణం అవుతుంది.మొన్నటి వరకు ఒకరిపై మరొకరు పరస్పరం మాటల యుద్ధం చేసుకోగా నరేష్ మూడవ భార్య రమ్య నటి పవిత్ర పై ఏకంగా చెప్పుతో దాడికి కూడా ప్రయత్నం చేసింది.
ఇలా వీరి మధ్య వివాదం రోజు రోజుకు బాగా ముదిరిపోతుంది.తాజాగా రమ్య మరోసారి ఈ వివాదంపై రమ్య స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నరేష్ నాకు విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్రతో కలిసి ఎలా ఉంటారు.నేను తన భర్తకు విడాకులు ఇవ్వనని అందరి ఎదురుగా తనతో మూడు ముళ్ళు వేయించుకున్నానని వెల్లడించారు.
ఈ విధంగా నన్ను పెళ్లి చేసుకొని నాకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరో మహిళతో కలిసి తిరగడం ఏంటి? నరేష్ పవిత్ర ఇద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను అంటూ రమ్య శపథం చేశారు.ఇక వారిద్దరూ కలిసి తిరుగుతుంటే వారికి అండగా పోలీసులు ఉండడం ఏంటో అంటూ ఈమె పోలీసులపై మండిపడ్డారు.
ఇక శనివారం సాయంత్రం నరేష్ పవిత్ర లోకేష్ ఓకే రెస్టారెంట్ లో దిగారనే విషయం తెలిసిన ఈమె ఆదివారం రెస్టారెంట్ కు వెళ్ళగా వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నరేష్ రమ్యను చూస్తూ విజిల్ వేస్తూ రెచ్చగొట్టారు.ఇకపోతే రమ్య ఆగ్రహంతో ఊగిపోయి చెప్పుతో దాడి చేయగా పోలీసులు అడ్డుకొని వారిని అక్కడి నుంచి పంపించారు.ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహార శైలి స్థాయికి చేరుకోవడంతో రమ్య ఎలాగైనా తన భర్తను తాను సొంతం చేసుకోవాలని చేస్తుంది.
ఈ క్రమంలోని వీరి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.ఇకపోతే పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ ఈ విషయంపై స్పందిస్తూ పవిత్ర తనకు భార్యని అయితే నాతో విడాకులు తీసుకోకుండానే తనకు నాకు పెళ్లి కాలేదని చెబుతుంది అంటూ కామెంట్ చేశారు.
డబ్బు పిచ్చి ఎక్కువ అంటూ ఈయన కామెంట్స్ చేశారు.